Sunday, May 5, 2024

డీఈఓ కు హార్ట్ ఎటాక్ కాదు… బ్రెయిన్ స్ట్రోకే

అనంతపురం ఆగస్టు 20: (ప్రభ న్యూస్ బ్యూరో) ‍ అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి ఎం. సాయిరామ్ కు హార్ట్ ఎటాక్ కాదని, బ్రెయిన్ స్ట్రోకే నని బెంగళూరులోని ఎస్తేర్ హాస్పిటల్ వైద్యులు ప్రకటించారు. శనివారం అర్ధరాత్రి దాదాపు 12 గంటల సమయంలో కేర్ అండ్ క్యూర్ ఆసుపత్రి నుండి అంబులెన్స్ లో బెంగళూరు ఆస్టర్ సీఎం ఐ హాస్పిటల్ కు తరలించారు. రాత్రి మూడు గంటలకి ఎంఆర్ఐ స్కానింగ్ చేశారు. ఆ రిపోర్టు ను చూసి హార్ట్ ఎటాక్ కాదని, బ్రెయిన్ స్ట్రోకే నని వైద్యులు నిర్ధారించారు

డీఈఓకు ఏలాంటి ప్రాణాపాయం లేదని, బ్రెయిన్ లో ఏర్పడిన ఒక క్లాట్ క్యూర్ అవ్వడానికి వారం లేదా పది రోజులు లేదా నెల అవుతుందని వైద్యులు తెలిపారు. డీఈఓ కు ఏలాంటి ప్రాణాపాయం లేదు అని వైద్యులు చెప్పడంతో ప్రతి ఒక్కరు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని పలు శాఖల జిల్లా ఉన్నత అధికారులు,విద్యాశాఖ , సమగ్ర శిక్ష అధికారులతో పాటు ఎంఈఓ లు, ఉపాధ్యాయులి ఆకాంక్షిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement