Thursday, April 25, 2024

CM Jagan : విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో బోట్లు దగ్ధం.. సీఎం జగన్‌ దిగ్భ్రాంతి

అమరావతి, న‌వంబ‌ర్ 20(ప్ర‌భ‌న్యూస్‌) విశాఖపట్నం ఫిషింగ్‌ హార్బర్‌లో మత్స్యకారుల బోట్లు దగ్ధమ‌య్యాయి. ఈ ఘటనపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.

ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరిపి కారణాలు వెలికి తీయాలని ఆదేశించారు. మంత్రి సీదిరి అప్పలరాజును ఘటనాస్థలానికి వెళ్లాలని ఆదేశించారు. బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు అండగా ఉండాలని, తగిన విధంగా వారికి సహాయం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement