Friday, April 26, 2024

సూసైనాధన్ కు ఉత్తమ పురస్కారం

రేణిగుంట, (ప్రభ న్యూస్): ప్రముఖ ప్రజ్ఞాశాలి సంగీత సాహిత్య శిల్ప కళా నాటక చిత్రకళా రంగంలో విశిష్ట సేవలందించిన సుసైనాదన్ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తమ పురస్కారాన్ని అందుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ వెల్ఫేర్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్ హాల్ నందు రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో బహుముఖ ప్రజ్ఞాశాలి సుసైనాధన్ ను రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ శాలువాతో సన్మానించి, ఘనంగా సత్కరించి మెమొంటోను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అత్యుత్తమ పురస్కారాన్ని అందుకున్న రేణిగుంట వాస్తవ్యులు సుసైనాధన్ ను సెయింట్ చర్చ్ ఫాదర్ సుసై రాజ్, ఎన్వీ లావణ్య కుమార్, క్రిస్టోఫర్, సెయింట్ చర్చ్ సిబ్బంది, వైయస్సార్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ అభినందించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement