Friday, April 26, 2024

Amaravati: రాజధాని రైతులకు బండి సంజయ్ మద్దతు

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఉద్యమానికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మద్దతు ప్రకటించారు. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన సందర్భంగా అమరావతి రైతులకు మద్దతు తెలపాలని పార్టీ శ్రేణులకు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అమరావతి కోసం జరుగుతున్న ఉద్యమంలో పాల్గొనాలని చెప్పారు. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ నేతలు ఇప్పటికే ఉద్యమంలో పాల్గొని మద్దతు తెలిపారు. తాజాగా తెలంగాణ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా వారికి అండగా నిలిచారు. త్వరలోనే బండి రాజధాని రైతులను కలవనున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ వెళ్లి రైతుల్ని కలిసి సంఘీభావం తెలపాలని భావిస్తున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.

కాగా, అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలంటూ రైతులు చేపట్టిన మహాపాదయాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో రైతల పాదయాత్ర సాగుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement