Thursday, May 2, 2024

AP: హిందూపురంలో బాల‌య్య ప‌ర్య‌ట‌న‌…వికలాంగుడికి హామీ…

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ రెండోరోజు పర్యటిస్తున్నారు. ఆయన నివాసం వద్ద బాలయ్యను చూడటానికి అభిమానులు పోటెత్తారు. పుట్టపర్తికి చెందిన వికలాంగుడు, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామాంజనేయ నాయుడును బాలకృష్ణ ఆప్యాయంగా పలకరించారు.

మోకాళ్లపై కూర్చొని వికలాంగుడైన రామాజనేయ నాయుడుకు బాలకృష్ణ శాలువా కప్పారు. రామాంజనేయులు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. జీవనాధారం ఎట్ల, పెన్షన్ 3వేలు సరిపోతుందా? అని బాలయ్య అడిగి తెలుసుకున్నారు. టీడీపీ కోసం ఫుల్ టైమ్ వర్కర్ గా పనిచేస్తున్నాను.. నాకు ఏదైనా న్యాయం చేయమని బాలయ్యను వికలాంగుడు రామాంజనేయ నాయుడు కోరారు. కచ్చితంగా పార్టీకోసం నీవు చేసిన కష్టాన్ని గుర్తించి తగు న్యాయం చేస్తానని వికలాంగుడికి బాలకృష్ణ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జై బాలయ్య.. జై జై బాలయ్య నినాదాలతో అభిమానులు హోరెత్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement