Monday, April 29, 2024

High Court: అంగళ్లు కేసుల్లో.. 79మంది టీడీపీ నేతలకు బెయిల్‌

అమరావతి: అంగళ్లు కేసుల్లో 79మంది టీడీపీ నేతలకు బెయిల్‌ మంజూరైంది. ఏపీ హైకోర్టు చిత్తూరు జిల్లా పుంగనూరు, అంగళ్లు కేసుల్లో టీడీపీ నేతలకు బెయిల్‌ మంజూరు చేసింది. చిత్తూరు, మదనపల్లె, కడప జైళ్లలో ఉన్న 79మంది నేతలకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

బెయిల్‌పై విడుదలైన వారు ప్రతి మంగళవారం పోలీస్‌స్టేషన్‌లో హాజరు కావాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు టీడీపీ ఎమ్మెల్సీ రాంభూపాల్‌రెడ్డిని తదుపరి విచారణ వరకు అరెస్ట్‌ చేయొద్దని స్పష్టం చేసింది. ఈ కేసుల్లోనే ముందస్తు బెయిల్‌ కోసం మరో 30మంది టీడీపీ నేతలు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. వారందరినీ తదుపరి విచారణ వరకు అరెస్ట్‌ చేయొద్దని ఏపీ హైకోర్టు ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement