Friday, April 26, 2024

నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్లు పాటించాలి

నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలని రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమీషన్ అధ్యక్షులు ఎ. శంకరనారాయణ పేర్కొన్నారు. మంగళవారం  శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అధ్యక్షతన అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు.  ఈ సందర్భంగా కమీషన్ అధ్యక్షులు మాట్లాడుతూ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి వెనుకబడిన తరగతుల కులాల్లోని అన్ని కులాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కుల ధృవీకరణ పత్రాలు జారీ చేసినపుడు క్షేత్ర స్థాయిలో విచారణ జరిపిన తర్వాతే కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయాలన్నారు. కుల ధ్రువీకరణ పత్రాలు జారీలో అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. కుల ధ్రువీకరణ పత్రాలు త్వరితగతిన జారీ చేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వ పథకాలు అన్ని కులాలకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

కమీషన్ సభ్యులు మరక్కగిరి కృష్ణప్ప మాట్లాడుతూ సామాజికంగా వెనుకబడిన వారికి న్యాయం చేయాలని కోరారు. విద్యలో సహాయ సహకారాలు అందించాలని, స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని తెలిపారు.  వారూ ఐఎఎస్, ఐపిఎస్ సాధించేందుకు సహకారం అందించాలన్నారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement