Friday, May 3, 2024

KNL: పాము కాటుకు.. పసి పాప బలి

కర్నూలు (క్రిష్ణగిరి) : క్రిష్ణగిరి మండలం పెద్దొడ్డి గ్రామంలో బోయ రవి కూతురు చిన్నారి ఇంటిముందు ఆడుకుంటుండగా నాగుపాము కాటువేసింది. పాప అరుపులు విని అక్కడికి వెళ్లి రాయి తొలగించి చూడగా.. రెండు నాగు పాములు ఉన్నట్లు గుర్తించి.. వాటిని బంధువులు హతమార్చారు.

చంపిన రెండు పాముల్లో ఒకటి నల్ల నాగుపాము. మరొకటి తెల్ల నాగుపాము. పాపని అంబులెన్స్ లో హాస్పిటల్ కి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మరణించడం జరిగిందని సమాచారం. పాము కాటుతో పసిపాప మృతిచెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement