Thursday, May 2, 2024

Breaking: నంద్యాలలో బీ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని నంద్యాల పట్టణంలోని క్రాంతి నగర్ కు చెందిన శ్వేత (19) అలె బీ ఫార్మసీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడింది. శ్వేత కడప జిల్లాలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీఫార్మసీ చదువుతుంది. అక్కడి వాతావరణం నచ్చక తిరిగి ఇంటికి వచ్చేసింది. అయితే కళాశాల యాజమాన్యం తన ఒరిజినల్ డాక్యుమెంట్ల కోసం వెళితే తిరిగి ఇవ్వలేదు. ఇవ్వకపోగా కళాశాలకు చెందిన రూ. లక్ష ఫీజు చెల్లిస్తేనే ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇస్తామని తేల్చి చెప్పారు. దీంతో మనస్థాపానికి గురైన శ్వేత తన ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement