Tuesday, April 30, 2024

భవిష్యత్తు ఆశల వారధిగా ఆవిర్భావ సభ.. ఐక్యత, అభివృద్ధి కోసం నిర్వహిస్తున్నాం: పవన్‌ కల్యాణ్‌

అమరావతి, ఆంధ్రప్రభ: జనసేన పార్టీని స్థాపించి ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని తొమ్మిదో వసంతంలోకి అడుగు పెడుతోందని, ఈ సందర్భంగా తొమ్మిదో ఆవిర్భావ దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని అమరావతి సమీపంలోని మంగళగిరి నియోజకవర్గం, ఇప్పటం గ్రామంలో నిర్వహిస్తున్నామని పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. రాష్ట్ర క్షేమాన్ని ఆకాంక్షించేవారు, జనసైనికులు, వీరమహిళలు ప్రతి ఒక్కరూ ఈ సభకు ఆహ్వానితులేనని ఆదివారం తెలిపారు. వీర మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు- చేశామని, వాళ్లు ప్రశాంతంగా కూర్చోవడానికి ప్రత్యేకంగా సీటింగ్‌ ఏర్పాటు- చేశామని, సభ కోసం పార్టీ నాయకులు 10 రోజులుగా చాలా కష్టపడుతూ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటు-న్నారని వివరరించారు. సభా ప్రాంగణానికి వచ్చేవారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు- జరుగుతున్నాయని, వేదికకు దూరంగా ఉన్నవారి కోసం ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు- చేస్తున్నామని చెప్పారు. ఈ ప్రాంగణానికి తాను ఎంతగానో అభిమానించే దామోదరం సంజీవయ్య పేరు నిర్ణయించామని, ఆయన స్ఫూర్తినే పార్టీలో కొనసాగిస్తామని వివరించారు.

అన్ని సభల్లాంటి సభ కాదిది..
సోమవారం జరగబోయే ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని అన్ని సభల్లాగా చూడటం లేదని, భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలను, రాష్ట్ర భవిష్యత్తును దిశానిర్దేశం చేయబోతున్నామని పవన్‌ పేర్కొన్నారు. గత రెండున్నరేళ్లలో జరిగిందేంటో, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు, ఉపద్రవాలు ఎదుర్కొన్నారో, భవిష్యత్తు ఎలా ఉండబోతోందో, భావి తరాలకు ఎలాంటి భరోసా కల్పిస్తే బలమైన భవిష్యత్తు ఇవ్వగలమనే అంశాలపై సభా వేదికపై మాట్లాడతానని తెలిపారు. అందుకే అందరూ క్షేమంగా వచ్చి సభను విజయవంతం చేసి క్షేమంగా ఇంటికి వెళ్తారని ఆశిస్తున్నానని పవన్‌ అన్నారు.

ఇది మా హక్కని చెప్పండి..
సభకు రానీయకుండా ప్రభుత్వం ఇబ్బందులు కలిగిస్తే సభకు వెళ్లడం ‘మా హక్కు’ అని చెప్పాలని పవన్‌ పిలుపునిచ్చారు. ‘మన ఆవిర్భావ దినోత్సవం మన హక్కు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. పోలీస్‌ శాఖకు కూడా మనస్ఫూర్తిగా విన్నవిస్తున్నాం.. సభకు పూర్తిగా సహకరించండి. ఈ కీలకమైన సభలో రాష్ట్రానికి సంబంధించి అనేక అంశాలపై మాట్లాడబోతున్నాను. చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. ఎన్నో విమర్శలు చేశారు. వాటన్నింటిపై కూడా ఆవిర్భావ దినోత్సవంలో సమాధానాలు చెప్తాను. 9వ ఆవిర్భావ దినోత్సవానికి వస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ఆహ్వానం. అలాగే దీనిని టీ-వీలో వీక్షించే వారికి, ప్రసారం చేసే మీడియా సంస్థలు, జర్నలిస్టులకు ధన్యవాదాలు. తెలుగు ప్రజల ఐక్యత కోసం, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం నిర్వహిస్తున్న ఈ సభకు అందరూ కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు-న్నాను’ అని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement