Friday, May 3, 2024

అవినాష్ రెడ్డికి సుప్రీంలో చుక్కెదురు…హైకోర్టు బెయిల్ ఉత్త‌ర్వులు ర‌ద్దు…

న్యూ ఢిల్లీ – వైసిపి ఎంపి అవినాష్ రెడ్డికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది.. హైకోర్టు ఇచ్చిన మ‌ధ్యంత‌ర బెయిల్ ఉత్త‌ర్వుల‌ను ర‌ద్దు చేసింది.. వివేకా హ‌త్య కేసులో హైకోర్టు అవినాష్ రెడ్డికి ముంద‌స్తు బెయిల్ ఇవ్వ‌డంపై వివేకా కుమార్తె సునీతా రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్ర‌యించారు.. దీనిపై ఇరు వ‌ర్గాల వాద‌న‌లు విన్న సుప్రీం కోర్టు హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్త‌ర్వుల‌ను ర‌ద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది..

జూన్ 30 తేది వరకు వివేకా హత్య కేసు విచారణ పొడిగింపు..

కాగా, వివేకా హత్య కేసు విచారణను జూన్ 30వ తేది వరకు పొడిగిస్తూ సిబిఐకి సుప్రీంకోర్లు ఆదేశాలిచ్చింది.. ఇంతకు ముందు ఈ కేసు విచారణను ఈ నెల 30వ తేది లోగా పూర్తి చేయాలని సుప్రీం ఉత్తర్వులిచ్చింది.. తాజాగా విచారణ జూన్ 30వ తేది వరకు సమయం ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement