Sunday, April 14, 2024

రాయల తెలంగాణపై.. జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. రాయలసీమను తెలంగాణలో కలపాలన్నారు. అప్పుడే సాగునీటి సమస్య తీరుతుందని అభిప్రాయపడ్డారు. అంతేకాదు రాయలసీమను తెలంగాణలో కలుపుకోవడానికి ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. ప్రత్యేక రాయలసీమని సాధించడం కష్టమేమో కానీ.. ఏదైనా రాష్ట్రంలో విలీనం చేయడం మాత్రం సులభమన్నారు. అలాగే రాష్ట్రాలను విడగొట్టడం కష్టం కానీ.. కలపడం సులభమని వ్యాఖ్యానించారు జేసీ దివాకర్ రెడ్డి. తమ వాళ్ళు ప్రత్యేక రాయలసీమ అంటున్నారని.. అది సహకారం అయితే మంచిదేనన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement