ఆర్టీసీ బస్సును ఆటో ఢీకొట్టడంతో నలుగురికి తీవ్రగాయాలైన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని కారంచేడు రోడ్డులోని ఫ్రేడ్ స్కూల్ వద్ద ఆర్టీసీ బస్సును ఆటో ఢీ కొట్టింది. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తులను చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి అతివేగమే కారణమని స్థానికులు అంటున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement