Kolluru: టీడీపీ అధినేత చంద్రబాబుకు దేవుడు మంచి మనసు ప్రసాదించాలని వైసీపీ నేతలు పాదయాత్ర చేపట్టారు. ప్రజలు చేత బంగాళాఖాతంలో విసిరివేయబడ్డ టీడీపీ.. ఆ పార్టీ అధ్యక్షుడితోపాటు వారి అనుచరులకు సద్బుద్ధి ప్రసాదించాలని నినాదాలు చేస్తూ యాత్ర కొనసాగించారు.
ప్రజాదరణ పథకాలతో దూసుకుపోతున్న వైసీపీ ప్రభుత్వంపై విషబీజాలు నాటాలనే ఉద్దేశంతో సభ్య సమాజం సిగ్గుపడేలా చెప్పలేని మాటలు అన్న తీరు జుగుప్సాకరంగా ఉందని, దానికి నిరసనగా వేమూరు నుంచి వైకుంఠపురం వరకు కాలి నడకన జనాగ్రహ యాత్ర నిర్వహించారు.
వేమూరు ఎమ్మెల్యే డాక్టర్ మెరుగు నాగార్జున, ఆయన తనయులు చందన్ నాగ్ ఆధ్వర్యంలో ఈ యాత్ర జరిగింది. ముందుగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి జంపని, పేదరావూరు మీదుగా వైకుంఠంపురం వరకు వెళ్లి వేంకటేశ్వస్వామిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు, ఆయన అనుచర గణానికి మంచి బుద్ధి ప్రసాదించాలని ప్రార్థనలు చేశారు.
ఈ యాత్రలో కొల్లూరు మండలం వైస్ ఎంపీపీ రాంబాబు, కొల్లూరు జెడ్పీటీసీ చొప్పార సుబ్బారావు, ఎంపీటీసీ అమ్మిసెట్టి శ్రీధర్, బుల్ల నవరత్నం, కనపర్తి మోహన్ రావు, కూచిపూడి మోషే, మాతంగి రత్న కుమార్, కో ఆప్షన్ సభ్యులు బాజి, సింగం కృష్ణ, అంబటి కిరణ్, చిలక ప్రకాష్, బాణాల రవి, నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.