Thursday, May 2, 2024

Ap Politics: బూతులు తిడితే తోపులైపోరు.. త్వ‌ర‌లోనే మీ బతుకేంటో తెలుస్తుంది: విజ‌య‌సాయిరెడ్డి

ఏపీ టీడీపీ నేత‌ల‌పై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఫైర్ అయ్యారు. అనుచిత వ్యాఖ్య‌లు చేస్తూ ఉనికిని చాటుకునేందుకు ఆ పార్టీ నేత‌లు య‌త్నిస్తున్నార‌ని ఆయ‌న ప‌రోక్షంగా ప‌లు వ్యాఖ్య‌లు చేశారు.

‘‘సీఎం జగన్ హుందాతనాన్ని బలహీనతగా తీసుకోవద్దు. ప్రతి ఎన్నికల్లో చిత్తుగా ఓడారు. రెండు వారాల్లో బద్వేలులో కూడా మీ బతుకేమిటో తెలిసిపోతుంది. ప్రజలు దేవుడిగా ఆరాధిస్తున్న వ్యక్తిపై దిగజారుడు భాషను ఉపయోగిస్తే తోపులైపోరు. జనం మధ్యకు వెళ్లాలి గాని పార్టీ ఆఫీసుల్లో ఏం పని?’’ అని ఆయ‌న ట్విట్ట‌ర్‌లో ప్ర‌శ్నించారు.

‘‘సంక్షేమ పాలన చూసి ఓర్వలేక అడ్రస్ గల్లంతవుతుందని విపక్షం అడ్డదారులు తొక్కుతోంది. బూతులు తిడుతూ రాజకీయం చేస్తే ప్రజలు హర్షించరు. రెచ్చగొట్టే విద్వేష రాజకీయాలకు కాలం చెల్లింది. తాడు బొంగరం లేని వారు తమాషా చేస్తారు. కేడర్ అప్రమత్తంగా ఉండాలి’’ అని వైసీపీ నేత‌ల‌కు విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement