టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఆయన రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ను కలవనున్నారు. ఆయనతో పాటు మరికొందరు టీడీపీ నేతలు రాష్ట్రపతిని కలవబోతున్నారు. టీడీపీ ఆఫీసులపై దాడి, ఏపీలో డ్రగ్స్, గంజాయి అంశాలపై రాష్ట్రపతికి వివరించనున్నారు.
ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ ను కూడా టీడీపీ నేతలు కోరారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులను చంద్రబాబు కలవనున్నట్టు సమాచారం.