Monday, April 29, 2024

AP : ఆటోను ఢీకొట్టిన ఏపీ మంత్రి వాహ‌నం…ఒక‌రు మృతి

ఏపీమంత్రి ఆదిమూల‌పు సురేష్ ఎస్కార్ట్ వాహ‌నం ఆటోను ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఒక‌రు మృతి చెంద‌గా మ‌రోక‌రి తీవ్ర గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న ప్ర‌కాశం జిల్లా త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగింది.

- Advertisement -

ప్రకాశం జిల్లా సీఎం జగన్‌ పర్యటన నేపథ్యంలో మంత్రి విజయవాడ నుంచి మార్కాపురం వెళ్తుండగా ఎస్కార్ట్‌ వాహనం ఆటోను ఢీకొట్టింది. దాంతో అందులో ఉన్న వ్యక్తి మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. బాధితుడిని మార్కాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడిని త్రిపురాంతకం మనరాజుపాలెంకు చెందిన ఇజ్రాయెల్‌గా గుర్తించారు. ప్రమాదం సమయంలో మంత్రి సురేష్‌ మరో వాహనంలో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement