Sunday, April 28, 2024

AP – విశాఖను విషాద పట్టణంగా మార్చిన సై కో జగన్ని తరిమికొడదాం – నారా లోకేష్

ఆంధ్రప్రభ స్మార్ట్, విశాఖపట్టణం ప్రతినిధి – ఏపీ సీఎం జగన్ విశాఖ పట్టణాన్ని విషాద పట్టణంగా మార్చారని, విశాఖలో రోజుకో మర్డర్, రోజుకో భూ కబ్జా జరుగుతున్నాయని, మీ కుటుంబాన్ని ఎవరు కిడ్నాప్ చేశారని ఎంపీని అడగండి. ఎమ్మార్వో రమణయ్యని కిరాతకంగా చంపారని, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో జరిగిన శంఖారావం సభలో నారా లోకేష్ మాట్లాడుతూ, జగన్ ఒక కటింగ్, ఫిటింగ్ మాస్టర్ అని మండిపడ్డారు. ఉత్తరాంధ్రకు పట్టిన శని జగన్ అని విరుచుకుపడ్డారు.

గత వారం రోజులుగా ఉత్తరాంధ్రతో పర్యటిస్తున్నానని. ఇక్కడి యువత గర్జిస్తోందని, . చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా వెలిగిన విశాఖ ఇప్పుడు గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారిందని, రెండు నెలల్లో టీడీపీ- జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని, ఇక్కడి ప్రజల కష్టాలు తీరుతాయన్నారు. ఆదాయం ఎక్కడ ఎక్కువ వస్తే అక్కడికి జగన్ వెళ్తాడని.మూడు రాజధానులు పెట్టి మూడు ముక్కలాట ఆడుతున్నాడని. 500 కోట్లతో రుషి కొండలో ప్యాలెస్ నిర్మిస్తున్నాడు. పంచగ్రామాల సమస్య పరిష్కరించే బాధ్యత మేమే తీసుకుంటాం. టి.డి.ఆర్ పేరుతో మధురవాడలో కోట్లు కుంభకోణం చేశారని లోకేష్ తీవ్రంగా ఆరోపించారు. ఎమ్మెల్సీ అనంతబాబు గంజాయి సరఫరా చేస్తున్నాడు. దళితులను చంపి డోర్ డెలివరీ చేస్తున్నాడు.

అర్జునుడు కాదు.. భస్మాసురుడు జగన్

అర్జునుడు కాదు భస్మాసురుడని, లక్ష కోట్ల ఆస్తి, లక్ష రూపాయలు చెప్పులు, వెయ్యి రూపాయలు నీళ్ళు తాగే జగన్ పెత్తందారుడని. జగన్ జలగ లాంటి వాడని. ఇసుకతో రోజు 3 కోట్లు, సంవత్సరానికి 1000 కోట్లు పైగా సంపాదిస్తున్నాడని , గూగుల్‌లో 6093 అని కొడితే జగన్ ఫొటో వస్తుందని లోకేష్ఆరోపించారు. పేద విద్యార్థులు అంటే జగన్‌కు చిన్న చూపని. జగన్ పిల్లలు మాత్రం విదేశాల్లో చదువుతారు.భయం నా బయోడేటాలో లేదు. భయ పడకుండా పాదయాత్ర చేశా. జగన్ మాదిరిగా పరదాలు మాటున తిరగలేదు. టీడీపీ జనసేన కలిసి పోరాడాలి. టీడీపీ జనసేన మధ్య పేటీఎం బ్యాచ్ చిచ్చు పెడుతోందని, ఐదేళ్లలో సీఎం జగన్ 100 పథకాలు కట్ చేశారు. రైతులకు అండగా ఉండటానికి రూ.25 వేల ఆర్థిక సాయం చేస్తాం. చంద్రబాబు పాలనలో నెలకో కంపెనీ వస్తే.. జగన్ తరిమివేశారు. 60 లక్షల మంది అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లను తనకు అన్నా ఎన్టీఆర్ ఇచ్చారు. మీ అందరినీ గుండెల్లో పెట్టుకొని కాపాడతా అన్నారు.

సైకో జగన్ని తరిమికొడదాం

- Advertisement -

తనపై కేసులు పెట్టారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. 2019కి ముందు ఒక్క కేసు లేదు. వైసీపీ నేతలు, అధికారులను వదలను. అందరి పేర్లు రెడ్ బుక్‌లో రాసి ఉన్నాయి. రెడ్ బుక్‌పై కేసు పెడతారాట.. దొంగ కేసు పెట్టి, 53 రోజులు చంద్రబాబును జైలులో ఉంచారు. తన జోలికొస్తే తోలు తీస్తా అని లోకేష్ హెచ్చరించారు. విశాఖ ఈస్ట్‌లో ఉన్నా, అరెస్ట్ చేయ్, చంద్రబాబు అరెస్టైన సమయంలో తనకు ఫోన్ చేసిన వ్యక్తి పవన్ కల్యాణ్. సంఘీభావం తెలిపేందుకు రాకుండా అడ్డుకున్నారని లోకేష్ వివరించారు. సైకో జగన్‌ను తరిమి తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని. పసుపు సైన్యం, జన సైనికులు కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని’ లోకేష్ అన్నారు.

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి పై యుద్ధం చేయాల్సిన అవసరం ఉందని నారా లోకేశ్ అభిప్రాయ పడ్డారు. టీడీపీ అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని స్పష్టం చేశారు. రైతులను ఆదుకుంటామని, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఉద్యోగం వచ్చే వరకూ నెలకు మూడువేల నిరుద్యోగ భృతి చెల్లిస్తామని, చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్తో ప్రజల వెన్నంటే ఉంటామని లోకేష్ బాబు హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement