Friday, May 10, 2024

ఎపిలో రుణ‌భారం రోజురోజుకి పై పైకి…

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: అభివృ ద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావిస్తూ రాష్ట్రా న్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికలను ఎప్పటికప్పుడు శరవేగంగా రూపొందిస్తున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రుణాలు తీసుకో వడంలోనూ అంతే వేగంగా ఉన్నారని కంఎ్టోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక స్పష్టంచేసింది. 2021-22 సంవత్సరా నికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు రూ.3.72 లక్షల కోట్లుగా ఉన్నాయ ని తెలిపింది. ఈమేరకు 2022 మార్చి 31వ తేదీతో ముగిసిన ఆర్ధిక సంవత్సరానికి సంబం ధించి ఆర్ధిక స్థితిగతులపై ఆడిట్‌ నివేదికను కంఎ్టోలర్‌ ఆడిట్‌ జనరల్‌ కార్యాలయం సమర్పించింది. ఈమేరకు రాష్ట్రంపై రుణ భారం పెరుగుతుందని, ఫలితంగా వచ్చే ఏడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం రూ.1, 29, 817 కోట్ల రుణాన్ని తీర్చాల్సి వస్తుందని స్పష్టంచేసింది. అదేవిధంగా 2018 నుండి 2022 వరకూ అంతర్గత రుణాల సంఖ్య కూడా 77.50 శాతం మేర పెరిగినట్లు వెల్లడించింది. 2021-22 ఆర్ధిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వ మొత్తం అప్పులు 3,72,503 కోట్లు-గా ఉన్నాయని పేర్కొంది. ఇందులో 90 శాతం మేర రుణాలు.. 13.99 శాతం వడ్డీ తో తీసుకున్నవే కావడం గమనార్హం.

ఉపయోగించని కేంద్ర గ్రాంట్లు
కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా వచ్చిన రూ. 6,356 కోట్ల గ్రాంట్‌ మురిగిపోయింది. గత ఏడాదితో పోలిస్తే చెల్లించాల్సిన రుణాలు రూ. 24,257 కోట్ల మేర పెరిగాయి. బడ్జేటేతర రుణాలు రూ. 1,18,394 కోట్లుగా నమోదు అయ్యాయి. డిస్కమ్‌లకు, నీటి పారుదల ప్రాజెక్టులకు చెల్లించాల్సిన బకాయిలు మరో రూ. 17,804 కోట్లు-గా ఉంది. వీటిని బడ్జెట్‌లో చూపక పోవటంతో కీలకమైన మౌలిక సదుపాయల కల్పనా నిధులపై శాసనసభ నియంత్రణ కోల్పోయేందుకు కారణమైందని పేర్కొంది. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో ఏపీ 18.47 శాతం జీఎస్‌డీపీ వృద్ధి రేటు- నమోదు చేసిందని తెలిపింది. 2021లో ఏపీ ఎఫ్‌ఆర్బీఎం చట్టాన్ని సవరించిందని, తద్వారా ఆర్ధిక రుణ పరిమితి పెంచుకునే ప్రయత్నం జరిగిందని చెప్పింది.

గడచిన ఐదేళ్లలో 61 శాతం పెరిగిన రుణాలు
గడిచిన 5 ఏళ్లలో తలసరి రుణం 61 శాతం మేర పెరిగిందని స్పష్టంచేసింది. బడ్జేటేతర రుణాలు కూడా కలిపితే తలసరి రుణ భారం రూ. 92,797 కోట్లుగా నమోదైంది. వచ్చే ఏడేళ్లలోగా రాష్ట్ర ప్రభుత్వం 1,29,817 కోట్ల రుణాల్ని తీర్చాలని కాగ్‌ తన నివేదికలో వెల్లడించింది. రూ. 688 కోట్ల రెవెన్యూ వ్యయాన్ని మూలధన వ్యయమని తప్పుగా వర్గీకరించారని వెల్లడించింది. నవరత్నాల్లో భాగంగా వైఎస్‌ఆర్‌ గృహవసతి పథకాన్ని మూలధన వ్యయంగా ప్రభుత్వం చూపిందని స్పష్టంచేసింది. లబ్దిదారులకు ఇచ్చే ఇళ్లస్థలాలు ఇళ్లను రెవెన్యూ వ్యయంగా చూపాల్సి ఉందని తెలిపింది. బడ్జెట్లో చూపని అదనపు రుణాలు పరిమితి కంటే అధికంగా ఉన్నాయని ముట్టికాయ వేసింది. స్మార్ట్‌ పట్టణాలు, కృషి వికాస్‌ యోజన, జాతీయ ఆరోగ్య మిషన్‌ లాంటి పథకాలకు రాష్ట్ర వాటా విడుదల కాకపోవటం వల్ల అవి సరిగ్గా అమలు కాలేదని తెలిపింది. రూ. 3,540 కోట్లు- విడుదల చేయాల్సి ఉన్నా రాష్ట్రం వివిధ పథకాలకు తన వాటా విడుదల చేయలేదని పేర్కొంది.

గడచిన ఐదేళ్లలో 6,534 క్లయిముల పరిశీలన
గడచిన ఐదేళ్ల కాలంలో వివిధ అంశాలకు సంబంధించి 6,534 క్లయిములను పరిశీలించి 560 క్లయిములను పరిష్కరించారు. అందుకోసం మరికొన్ని క్లయిములకు తాత్కాలిక రిఫండ్‌ను మంజూరు చేశారు. అలాగే మూల ధనం కోసం పన్ను చెల్లింపుదారులకు అవసరమైన నిధుల ప్రవాహాన్ని అందుబాటులోకి తీసుకురావడంలో జరిగే జాప్యాలకు సంబంధించిన అంశాలను పరిశీలించారు. ఆదిశగా కొన్ని శాఖలకు సూచనలు ఇచ్చి క్లయిములను పోస్టు ఆడిట్‌ నిర్వహించారు. అలాగే రాబడి నష్టాన్ని నివారించడానికి పోస్టు ఆడిట్‌ను తప్పనిసరిగా చేపట్టేలా ఆదేశాలిచ్చారు. అలాగే రిఫండ్‌ మంజూరుకు సంబంధించి ప్రస్తుత విధానాలను క్రమబద్దీకరించేప్పుడు ఖజానాకు రాబడి నష్టం వాటిల్లకుండా నిర్దేశించిన విధానాన్ని అమలు జరిపారు. అలాగే పన్ను చెల్లింపుదారులకు కూడా కొన్ని వెసులుబాటులు కల్పిస్తూ క్లయిముల్లో మరికొన్ని నిర్ణయాలు తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement