Wednesday, May 1, 2024

ఏపీలో కొత్తగా 1578 మందికి కరోనా పాజిటివ్..

ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,578 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. రాష్ట్రవ్యాప్తంగా 62,657 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించారు. తాజా గణాంకాలతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 19,24,421కి పెరిగాయి. మొత్తం 18,84,202 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు  13,024 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 27,195 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,30,48,945 మంది శాంపిల్స్ ని పరీక్షించడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 305 కేసులు, శ్రీకాకుళం జిల్లాలో అత్యల్పంగా 31 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 22 మంది మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 3,041 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

ఇది కూడా చదవండి: అతి త్వరలోనే కరోనా థర్డ్ వేవ్.. నిర్లక్ష్యంగా ఉండొద్దు: ఐఎంఐ

Advertisement

తాజా వార్తలు

Advertisement