Thursday, May 2, 2024

ఏపీలో తగ్గని కరోనా ఉద్ధృతి

ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉద్ధృతి తగ్గడం లేదు. గత రెండు రోజులుగా స్వల్పంగా తగ్గిన కేసులు తాజాగా మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 91,120 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 18,285 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా మహమ్మారికి 99 మంది బలైయ్యారు. అదే సమయంలో 24,105 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని ఆరోగ్యవంతులు అయ్యారు. ఇప్పటి వరకు మొత్తం 1627390 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం 1,92,104 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం 10,427 మంది మరణించారు.

గడిచిన 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో 15 మంది, పశ్చిమగోదావరిలో 14, విజయనగరంలో 9, అనంతపురం, తూర్పుగోదావరి, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో 8మంది చొప్పున మృతి చెందారు. కర్నూ్ లో 6, గుంటూరు, కృష్ణ, శ్రీకాకుళం జిల్లాల్లో ఐదుగురు మరణించారు.

ఇక, గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 3296 కేసులు నమోదు అయ్యాయి. అనంతపురం 1876, చిత్తూరు 1822, గుంటూరు1211, విశాఖపట్నం 1800, పశ్చిమగోదావరి జిల్లా 1664, శ్రీకాకుళం 1207, నెల్లూరు 1159, కర్నూల్ లో 1026 ప్రకాశం 1056, విజయనగరం 639,కడప 877, కృష్ణలో 652 కరోనా పాటిజివ్ కేసులు నమోదు అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement