Sunday, May 19, 2024

AP: ఆరోగ్యశ్రీ పరిధిలోకి కొత్తగా 809 చికిత్సలు.. ప్రారంభించిన ఏపీ సీఎం

ఆరోగ్య శ్రీ పరిధిలోకి మరో 809 చికిత్సలను చేరుస్తున్నట్లు ఏపీ ప్ర‌భుత్వం తెలిపింది. ఈ మేర‌కు సీఎం జ‌గ‌న్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. పెంచిన చికిత్సలతో ఆరోగ్య శ్రీ పథకం కింద 3,255 చికిత్సలను అందిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంతో పోలిస్తే త‌మ హ‌యాంలో అదనంగా 2,196 వైద్య చికిత్సలను అదనంగా చేర్చామ‌న్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జరిగిన వైద్య ఆరోగ్య శాఖ రివ్యూలో ఏపీ సీఎం నూతన చికిత్సలను ఆరోగ్య పథకం కింద అమలు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement