Sunday, April 28, 2024

AP – చంద్రబాబు నివాసంలో ముగిసిన రాజశ్యామల యాగం

ఉండవల్లి :- టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నినాసంలో మూడు రోజులుగా జరుగుతున్న రాజశ్యామల యాగం ముగిసింది. శుక్రవారం నుండి నేటి వరకు మూడు రోజుల పాటు యాగం వైభవంగా జరిగింది. గుంటూరుకు చెందిన వేదపండింతులు పి.శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో యాగం నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన 50 మంది రిత్వికులు చంద్రబాబు, భువనేశ్వరి దంపతుల చేత పలు పూజాక్రతువులు నిర్వహించారు. మూడవ రోజు మధ్యాహ్నం పూర్ణాహుతి కార్యక్రమంతో యాగం ముగిసింది. ఈ యాగంలో పార్టీ కార్యాలయ సిబ్బంది కుటుంబ సభ్యులతో కలసి పాల్గొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement