Wednesday, May 1, 2024

నేటి నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా సోమవారం ఉదయం 9:30కు చంద్రబాబు నివాసంలో టీడీపీ నేతలు భేటీ కానున్నారు. ప్రభుత్వ విధానాలకు నిరసన తెలుపుతూ అసెంబ్లీ ప్రాంగణానికి వెళ్లనున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం  సభ వాయిదా పడనుంది. అనంతరం అసెంబ్లీలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సీఎం, శాసనసభా వ్యవహారాల మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు పాల్గొననున్నారు. అనంతరం బీఏసీ సమావేశంలో అసెంబ్లీ షెడ్యూల్‌ ఖరారు చేయనున్నారు. బీఏసీ మీటింగ్ ముగిసిన వెంటనే సచివాలయంలో కేబినెట్‌ భేటీ అవుతుంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement