Thursday, May 2, 2024

AP – మా పార్టీ విధానం అది కాదు : మంత్రి బొత్స

హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కొనసాగింపు సాధ్యం కాదని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.హైదరాబాద్ ఉమ్మడి రాజధాని తమ పార్టీ విధానం కాదని బొత్స తేల్చిచెప్పారు.పదేళ్ల తర్వాత ఉమ్మడి రాజధాని ఎలా సాధ్యమవుతుందని ఎదురు ప్రశ్నించారు. అనుభవం ఉన్న నేత ఎవరూ ఉమ్మడి రాజధాని వ్యాఖ్యలు చేయరని పేర్కొన్నారు.

వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి హైదరాబాద్ ను ఉమ్మడి రాజధాని కొనసాగించాలని మంగళవారం మాట్లాడారు. తాము హైదరాబాద్లో ఉమ్మడి రాజధాని కొనసాగించాలన్నది తమ ఆలోచన కాదని, వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని బొత్స అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement