Monday, May 6, 2024

ఢిల్లీకి ఏపీ బీజేపీ బృందం

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలో రాష్ట్ర బీజేపీ నేతల బృందం మంగళవారం ఢిల్లీ వెళ్లనుంది. ఈ బృందం ఢిల్లీలో మూడు రోజుల పాటు పర్యటించనుంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వివరించనున్నారు. అటు, రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, తదితర ఆర్థిక లావాదేవీలపై ఆర్బీఐకి ఫిర్యాదు చేయనున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ను కూడా సోము వీర్రాజు బృందం కలవనుంది. రాష్ట్రంలో ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నారు. రైల్వేశాఖ మంత్రిని కలసి.. రాష్ట్రంలోని రైల్వే పెండింగ్ ప్రాజెక్టులు, విశాఖ రైల్వే జోన్ అంశంపై చర్చించనున్నారు. కొత్త రైల్వే లైను కొవ్వూరు – భద్రాచలంపై వినతి పత్రం ఇవ్వనున్నారు. కేంద్ర మంత్రులతో సమావేశం తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డాతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాలు, విస్తరణ, బలోపేతానికి తీసుకుంటున్న చర్యలను వివరించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement