Monday, May 6, 2024

AP | నేడు ప్రైవేటు డిగ్రీ కళాశాలల బంద్‌ !

అమరావతి, ఆంధ్రప్రభ:ఉనత విద్యాశాఖ డిగ్రీ కళాశాలలో ఫీజులు నిర్ధారిస్తూ ఇచ్చిన జీవోను పున: పరిశీలించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు డిగ్రీ కళాశాలను శుక్రవారం బంద్‌ చేస్తున్నట్లు ఆంధ్ర ప్రదేశ్‌ ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల సంఘం అధ్యక్షుడు కే గుండారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

కళాశాలల్లో ఫీజులను నిర్ధారిస్తూ ఈనెల12వ తేదీన జీవో నెం. 22ను ఉన్నత విద్యా ఖాఖ విడుదల చేసింది. ప్రైవేటు కళాశాల మనుగడకు ఇబ్బందికరంగా ఉన్న ఈ జీవోకు వ్యతిరేకంగా శుక్రవారం రాష్ట్రంలో అని డిగ్రీ కళాశాలలు బంద్‌ కు పిలుపునిచ్చాయని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని గమనంలో ఉంచుకుని విద్యార్ధుల తల్లిదండ్రులు తమకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement