Sunday, April 28, 2024

AP: అసెంబ్లీ స‌మావేశాలు…తొలిరోజు గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం…

ఇవాళ్టి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. తొలిరోజు గ‌వర్నర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. స్పీకర్‌ తమ్మినేని సీతారాం నేతృత్వంలో బీఏసీ సమావేశం జరుగుతుంది.

బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎప్పటివరకు నిర్వహించాలనేది నిర్ణయించనున్నారు. ఈ సమావేశానికి సభానాయకుడు జగన్‌, టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత కింజరాపు అచ్చెన్నాయుడు హాజరవనున్నారు. మంగళవారం గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. అలాగే ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ మృతి పట్ల శాసనమండలిలో సభ్యులు సమావేశమై సంతాప తీర్మానాన్ని ప్రవేశపెడతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement