Friday, May 3, 2024

AP – సమ న్యాయం… అటు నలుగురు… ఇటు నలుగురి పై అనర్హత వేటు

:ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల పార్టీ మారిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. ఈ మేరకు సోమవారం రాత్రి అధికారిక ఉత్తర్వులను స్పీకర్ కార్యాలయం జారీ చేసింది.

.వైసీపీ పార్టీకి చెందిన మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవీలు, అలాగే టీడీపీ నుంచి వైసీపీలో చేరిన వాసుపల్లి గణేశ్, వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాల గిరిలు ఉన్నారు. ఇదిలా ఉంటే గతంలో పార్టీలు మారిన టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేసి.. వివరణ కోరగా.. పలుమార్లు ఎమ్మెల్యేలు వివరణ ఇవ్వకుండా గైర్హాజరైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే స్పీకర్ తమ్మినేని ఈ నిర్ణయం తీసుకున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement