Thursday, May 2, 2024

AP | వైసీపీపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది.. కూటమి గెలవడం ఖాయం : చంద్రబాబు

రాయలసీమలో అన్ని సీట్లూ ఎన్డీఏ కూటమే కొల్లగొడుతుందని తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు అన్నారు. పవన్ కల్యాణ్‌తో కలిసి ఎన్డీయే అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వైఎస్ జగన్ పై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని.. ఈ తిరుగుబాటే జగన్ ను ఇంటికి పంపిస్తుందని అన్నారు. వైసీపీకి ఓటేస్తే ప్రజల గతి ఇక అంతే అని తెలిపారు. మద్యం వ్యాపారంతో పెద్దిరెడ్డి కుటుంబం రౌడీయిజం చేస్తోంది అని మండిపడ్డారు. ఆ కుటుంబాన్ని జిల్లా నుంచి తరిమేయాలి అని పిలుపునిచ్చారు.

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. జిల్లా చేయకుండా రాజంపేట ప్రజలకు అన్యాయం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. రాజంపేట, రాయచోటి, మదనపల్లెకి అన్యాయం చేయమని చెప్పారు. ప్రజాభిప్రాయంతోనే పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. అన్నమయ్య ప్రాజెక్టును బాగు చేసి బాధితులను అండగా ఉంటామని అన్నారు. గాలేరు-నగరి కాలవను పూర్తి చేసి కృష్ణా జలాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement