Saturday, May 18, 2024

AP | గెలిచేది మ‌న‌మే.. మన తడాఖా చూపిద్దాం : చంద్రబాబు

ఈ లోక్‌సభ ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి, జయచంద్రా రెడ్డి గెలవడం ఖాయం.. దేవుడు స్క్రిప్టు తిరగరాశాడు… గెలిచేది మనమే! చిత్తుచిత్తుగా ఓడిపోయి వైసీపీ ఇంటికి వెలుతుంది.. మన కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంటుకు, జయచంద్రారెడ్డి పార్లమెంటుకు వెళతారు… అప్పుడు చూపిస్తా మన తడాఖా! అని చంద్రబాబు ధీమా వ్యఖ్తం చేశారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో ప్రజాగళం సభకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ…. ఈసారి కూడా నరేంద్ర మోదీనే ప్రధాని అవుతారని, 400 ఎంపీ సీట్లతో ముచ్చటగా మూడోసారి ప్రధాని పీఠం ఎక్కబోతున్నారని నమ్మకం వెలిబుచ్చారు.

నరేంద్ర మోదీ పార్టీలోని ఎంపీని తాకే ధైర్యం ఎవరికైనా ఉంటుందా? తాకడానికి ఎవరైనా వస్తే మసైపోతారు అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాజంపేట లోక్ సభ స్థానంలో కూటమి అభ్యర్థిగా ఉన్న బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఒక అనుభవజ్ఞుడైన నాయకుడు అని కొనియాడారు. కిరణ్ కుమార్ అనుభవంతో పోల్చితే ఈ పాపాల పెద్దిరెడ్డి ఒక బచ్చా అని పేర్కొన్నారు. పదవుల కోసం కాళ్ల దగ్గర కూర్చున్న బచ్చా అని విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement