Monday, May 6, 2024

యాక్సిడెంట్ ఘ‌ట‌న‌లో మరొక‌రు మృతి, ఏడుకు చేరిన మృతుల సంఖ్య.. బాధిత కుటుంబాల‌కు పిన్నెల్లి ప‌రామ‌ర్శ

గురజాల (ప్రభ న్యూస్): ప‌ల్నాడు జిల్లాలో నిన్న (ఆదివారం) అర్ధరాత్రి యాక్సిడెంట్‌కు గురై చ‌నిపోయిన మృతుల కుటుంబాల‌ను మాచ‌ర్ల ఎమ్మెల్యే, ప్ర‌భుత్వ విప్ పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి ఇవ్వాల (సోమ‌వారం) ప‌రామ‌ర్శించారు. రెంట‌చింతల మండలం ఎర్రకాలువ ద‌గ్గ‌ర‌ ఆగి ఉన్న లారీని టాటా ఏస్ వాహ‌నం ఢీకొని నిన్న ఆరుగురు చ‌నిపోయిన విష‌యం తెలిసిందే. శ్రీశైలం వెళ్లి వ‌స్తుండ‌గా రెంట‌చింతలకు చేరుకొని మరో రెండు నిమిషాల్లో ఇంటికి చేరుకుంటామ‌న‌గా లారీ రూపంలో మృత్యువు వారిని క‌బ‌లించింది.

దీంతో అక్క‌డిక‌క‌క్క‌డే నలుగురు చ‌నిపోగా, గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే క్ర‌మంలో మ‌రో ఇద్ద‌రు మరణించారు. కాగా, ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ఇంకొక‌రు చ‌నిపోయిన‌ట్టు ఇవ్వాల డాక్ట‌ర్లు చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. వారికి ధైర్యాన్ని చెప్పి ప్రభుత్వపరంగా ఆదుకుంటామని తెలిపారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యాక్సిడెంట్​ బాధితురాలి
Advertisement

తాజా వార్తలు

Advertisement