Tuesday, March 26, 2024

వార్షిక బడ్జెట్‌ సమావేశాలు 11 రోజులకే పరిమితం..

అమరావతి, ఆంధ్రప్రభ: శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ఈసారి 11 రోజులు మాత్రమే జరగనున్నాయి. ఈ నెల 14న ప్రారంభమయ్యే సమావేశాలు 29 వరకు జరపాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. మధ్యలో శని, ఆదివారాలు, ఉగాది సెలవు రోజులు మినహా మిగిలిన రోజుల్లో సభ జరగనుంది. 17న బడ్జెట్‌ ప్రవేశపెట్టి, 18, 19 సెలవులు ప్రకటించనుంది.

25, 26 తేదీల్లో శని, ఆదివారాలు కాగా, 22న ఉగాది సందర్భంగా సెలవు రానుంది. 30న శ్రీరామనవమి సెలవు కావడంతో 29నే సమావేశాలను ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ తేదీలను అధికారికంగా బిజినెస్‌ సలహా మండలి సమావేశంలో ఖరారు చేయాల్సి వుంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement