Tuesday, April 23, 2024

AP Politics | టీడీపీలో చేరిన మదనపల్లి వైసీపీ ఎమ్మెల్యే సోదరుడు నవాజ్​ బాషా

మదనపల్లి (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్​లో రాజకీయాలు మారుతున్నాయి. ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీపై ప్రజల్లో నమ్మకం పోతోంది. దీంతో చాలా ప్రాంతాల్లో ఆ పార్టీపై, సీఎం జగన్​మోహన్​రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతోంది. దీంతో సామాన్యులు సైతం జగన్​ పాలన తీరును విమర్శిస్తున్నారు.

ఇక.. మదనపల్లె నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ ఎమ్మెల్యే షాజాహాన్​ బాషా సోదరుడు అయిన నవాజ్​ బాషా ఇవ్వాల (శుక్రవారం) టీడీపీలో చేరారు. యువగళం పాదయాత్రలో భాగంగా మదనపల్లిలో పర్యటిస్తున్న నారా లోకేష్ ఆయనకు తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement