Monday, May 6, 2024

AP Corona: కొత్తగా 396 కేసులు.. ఆరు మరణాలు

ఏపీలో గత 24 గంటల్లో 40,855 మందిక కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 396 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఆరుగురు మృతి చెందారు. అదే సమయంలో 566 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. ఇప్పటివరకు ఏపీలో మొత్తం 20,63,177 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 20,43,616 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో మొత్తం 14,339 మంది మరణించారు. ప్రస్తుతం ఏపీలో 5,222 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ఇక జిల్లాల విషయానికి వస్తే.. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 94 కేసులు నమోదు అయ్యాయి. అనంతపురం 4, తూర్పుగోదావరి 33, గుంటూరు 61, కడప 11, కృష్ణా 56, కర్నూల్ 4, నెల్లూరు 19, ప్రకాశం 20, శ్రీకాకుళం 15, విశాఖపట్నం 34, విజయనగరం 12, పశ్చిమగోదావరి జిల్లాలో 32 కేసులు వెలుగు చూశాయి. కృష్ణాలో ఇద్దరు, గుంటూరు, ప్రకాశం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.

ఇది కూడా చదవండి: రేవంత్ ను కలిస్తే తప్పేంటి? : బీజేపీ నేత ఈటల

Advertisement

తాజా వార్తలు

Advertisement