Saturday, May 4, 2024

ఏపీలో కొత్తగా 400 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 37,744 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 400 కేసులు నమోదు అయ్యాయి. కోవిడ్ తో చిత్తూరు, గుంటూరు, కృష్ణ, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. అదే సమయంలో మొత్తం 516 మంది కోవిడ్ నుంచి పూర్లిగా కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 20,63,577కి చేరగా.. ఇందులో 20,44,132 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,102 కేసులు యాక్టివ్ గా ఉండగా.. మొత్తం 14,343 మంది మరణించారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 73 కేసులు నమోదు కాగా.. కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 3 కేసులు వెలుగు చూశాయి.

ఇది కూడా చదవండి: Huzurabad bypoll: కేసీఆర్ లేకపోతే ఈటల ఉండేవాడా?

Advertisement

తాజా వార్తలు

Advertisement