Monday, May 6, 2024

AP Corona Update: కొత్తగా 332 కోవిడ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 30,219 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 332 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. కోవిడ్ వల్ల కృష్ణా జిల్లాలో ఇద్దరు, చిత్తూరు, గుంటూరు, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 651 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని ఆరోగ్యవంతులైయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,709 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం 20,60,804 కేసులు నమోదు కాగా.. ఇందులో 20,40,782 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 14,313 మంది మృతి చెందారు.

ఇది కూడా చదవండి: కేశినేని భవన్ లో చంద్రబాబు ఫొటో తొలగింపు.. నాని పార్టీ మారుతారా?

Advertisement

తాజా వార్తలు

Advertisement