Friday, April 26, 2024

ఆంధ్రప్రభ ఎఫెక్ట్ .. అధికారులను దూషించిన వైసీపీ కన్వీనర్ తొలగింపు

అనంతపురం: అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం లో అధికారులను నోటికొచ్చినట్టు బూతులు తిట్టిన వైసీపీ మండల కన్వీనర్ ఇందుకూరు నారాయణ రెడ్డిని ఆ పార్టీ నుంచి తొలగించారు. ఈ మేరకు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రభలో ఉద్యోగులపై విరుచుకుపడిన నారాయణరెడ్డి వాయిస్​ రికార్డు వార్త పబ్లిష్​ కావడంతో దీనిపై ఎమ్మెల్యే స్పందించారు.

అధికారులను దూషించిన వైఖరిని ఆయన ఖండించారు. పార్టీకి, తనకు ఇది చాలా ఇబ్బందిగా మారిందని ఎమ్మెల్యే అన్నారు. ఇదిలా ఉండగా.. దళితులైన ఉద్యోగులను దూషించిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement