Thursday, July 25, 2024

Andhra Pradesh – ప్రభుత్వం ఏర్పాటు చేయండి – చంద్రబాబుకు గవర్నర్ ఆహ్వానం….

ఎపిలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా ఎన్డీఎ కూటమి నేత చంద్రబాబు నాయుడిని ఆ రాష్ట్ర గవర్నర్ జస్జీస్ అబ్దుల్ నజీర్‌ కోరారు…ఈ మేరకు గవర్నర్ ఆహ్వానం మేరకు నేటి సాయత్రం చంద్రబాబు రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలిశారు. ఈ సందర్భంగా తనకు మద్దతు ఇచ్చిన 163 మంది ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్‌కు అందజేశారు. అలాగే మంత్రి వర్గ ఏర్పాటు వివరాలపై గవర్నర్ తో చర్చించారు.. ఇక బుధవారం ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఆయనతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించనున్నారు. అందుకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. అయితే వాటిని పరిశీలించేందుకు రావాలని ఈ సందర్బంగా గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌కు చంద్రబాబు విజ్జప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement