Sunday, April 28, 2024

Andhra Pradesh – కూట‌మి మేనిఫెస్టో రూప క‌ల్ప‌న‌లో ప్ర‌జ‌ల భాగ‌సామ్యం

అమరావతి: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో టిడిపి , జనసేన, బిజెపి కూటమి సంయుక్తంగా విడుదల చేయనున్న ‘ప్రజా మేనిఫెస్టో’ రూపకల్పనలో ప్రజలను కూడా భాగం చేయాల‌ని నిర్ణ‌యించింది.. మేనిఫెస్టోలో రూపొందించే అంశాలపై సలహాలను, సూచనలను ప్ర‌జ‌ల నుంచి స్వీకరించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు 8341130393 నంబర్‌కు సూచనలను టెక్ట్స్‌ రూపంలో గానీ, వాయిస్‌ మెసేజ్‌, పీడీఎఫ్‌గానైనా పంపొచ్చని కూటమి నేతలు ఓ ప్రకటన విడుదల చేశారు. ఏపీలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే ఎన్డీయే కూటమి అజెండా అని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement