Saturday, April 20, 2024

మహాలక్ష్మీదేవికి రత్న కిరీటం వితరణ

ధర్మవరం అర్బన్ – అతిపురాతన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంలోని మహాలక్ష్మి దేవికి శనివారం స్థానిక తేరు బజారు కు చెందిన కలవల రంగనాథం కుటుంబ సభ్యులు రత్న కిరీటాన్ని వితరణ చేశారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం ఆలయ అర్చకులు కోనేరు ఆచార్యులకు రంగనాథం కుటుంబ సభ్యులు రత్న కిరీటాన్ని బహుకరించారు. దీంతో ప్రత్యేక పూజలు నిర్వహించి దాతలను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement