Tuesday, May 7, 2024

మినీ బస్సు బోల్తా
ముగ్గురు దుర్మ‌ర‌ణం

కొద్దిసేపట్లో ఇళ్ల‌కు చేరుకుంటామనుకున్నారు. ఇంత‌లోనే అనుకోని ప్ర‌మాదం.. ఓ మూల‌మ‌లుపు వ‌ద్ద వారు ప్ర‌యాణిస్తున్న మినీబ‌స్సు బోల్తా ప‌డింది.. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు దుర్మ‌ర‌ణం చెందారు. ప‌లువురు గాయ‌ప‌డ్డారు. ఈ దుర్ఘటన అనంతపురం జిల్లా నల్లమడ మండలం పులగం పల్లి క్రాస్ వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగింది.

ఈ ప్ర‌మాదంలో పులగం పల్లి గ్రామానికి చెందిన చలపతి,ఈశ్వరమ్మ, బోగాధమ్మ,అక్కడికక్కడే మృతి చెందారు. వీరంతా తిరుమల ద‌ర్శ‌నానికి వెళ్లి తిరిగి వ‌స్తుండ‌గా ఈ ప్రమాదం జరిగింది. కొద్ది నిమిషాల్లో పులగంపల్లి కు చేరుకుంటార‌నే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో పలువురు గాయపడ్డారు. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. సంఘ‌ట‌న స్థలాన్ని సీఐ నిరంజన్ రెడ్డి , ఎస్ గోపి ప‌రిశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement