Saturday, May 4, 2024

Anantapur – ఎపిలో రోడ్డు ప్ర‌మాదం … ముగ్గురి దుర్మ‌ర‌ణం

అనంతపురం జిల్లా కురుగుంట వద్ద రోడ్డుప్రమాదం సంభవించింది. రహదారిపై నిలిపి ఉంచిన సిమెంట్ లారీని ఓ ఐచర్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతులను కర్నాటకకు చెందిన వారిగా గుర్తించారు. కాగా ఈ ప్రమాదం అనంతపురం నుంచి కళ్యాణదుర్గం వెళ్తుండగా జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement