Monday, April 29, 2024

మూడు రోజుల టూర్‌… ఏపీకి వ‌స్తున్న అమిత్‌షా..

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆంధ్రప్రదేశ్‌ రానున్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు రాత్రి 7.40 గంటలకు రేణిగుంటకు చేరుకుంటారు. రాత్రి తిరుపతిలోని తాజ్‌ హోటల్‌లో బసచేస్తారు. ఆదివారం ఉదయం నెల్లూరు జిల్లా వెంకటాచలంలో జరుగుతున్న స్వర్ణభారతి ట్రస్టు 20వ వార్షికోత్సవం, ముప్పవరపు ఫౌండేషన్‌ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

అనంతరం తిరుపతిలో జరగనున్న దక్షిణాది జోనల్‌ కౌన్సిల్‌ సమావేశానికి నేతృత్వం వహిస్తారు. ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల సీఎంలు కూడా హాజరవుతారు. సోమవారం ఉదయం తిరుమల శ్రీ‌వారిని కేంద్ర మంత్రి అమిత్‌షా దర్శించుకుంటారు. అటునుంచి ఢిల్లీకి తిరుగు పయణమవుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement