Wednesday, April 24, 2024

అసెంబ్లీలో ఆడపడుచుపై అసత్య ఆరోపణలు సరికావు : రేణుకా చౌద‌రి

అసెంబ్లీలో ఆడ‌ప‌డుచుపై అస‌త్య ఆరోప‌ణ‌లు చేయ‌డం స‌రికాద‌ని మాజీ కేంద్ర‌మంత్రి రేణుకా చౌద‌రి అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ….సభలో ప్రతిపక్ష నాయకుడిని అవమానపరచడానికి ఆయన భార్య వ్యక్తిత్వాన్ని చులకన చేసి మాట్లాడడం సభామర్యాద కాదన్నారు. అసలు సభలో లేని, సభకు సంబంధం లేని వ్యక్తుల పేర్లు ప్రస్తావించి వారి పై చవకబారు ఆరోపణలు చేయడం విజ్ఞతకాదన్నారు.

అధికారం, సభలో మంది బలం ఎప్పుడూ శాశ్వతం కాదన్నారు. కేవలం మన హుందాతనం, ప్రవర్తన మాత్రమే శాశ్వతమ‌న్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ఉండాల్సిన శాసనసభ వ్యక్తిగత దూషణలకు, నిందారోపణలకు వేదికవ్వటం విచారకరమ‌న్నారు. ప్రస్తుత రాజకీయాల్లో హుందాతనం లోపిస్తోందన్నారు. ప్రజా ప్రతినిధులు బాధ్యత మరచి అసభ్య పదజాలంతో మాట్లాడటం సరైంది కాదన్నారు. అధికార, ప్రతిపక్షాలు సంయమనంతో వ్యవహరించాలన్నారు. మహిళలు, కుటుంబ సభ్యులపై నిందారోపణలకు స్వస్తి పలకాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక ఎజెండాగా సభ్యులు పనిచేయాలన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement