Saturday, April 27, 2024

AP: తిరుమల శ్రీవారిని స‌న్నిధిలో…నటుడు రాంచరణ్ దంపతులు…

తిరుమల శ్రీవారిని సినీ నటుడు రాంచరణ్ దంపతులు దర్శించుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా రాంచరణ్…తన కూతురు క్లీంకారా, భార్య ఉపాసన మరికొందరు కుటుంబసభ్యులతో కలిసి సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.

రంగనాయకుల మండపంలో రాంచరణ్ దంపతులకు పండితులు వేదాశీర్వచనం చేయగా, అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు. దర్శనాంతరం ఆలయం వెలుపలకు వచ్చిన రాంచరణ్‌ను చూసేందుకు భక్తులు ఆసక్తి చూపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement