Friday, May 3, 2024

బీసీలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు.. రజకులపై వేధింపులు త‌గ‌దన్న అచ్చెన్న‌

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలపై వైకాపా నేతలు, ప్రభుత్వం ఆదినుంచి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం పూలకుంటలో రజకులపై వైకాపా నేత నర్సింహారెడ్డి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. మంగళవారం మీడియాకు విడుదల చేసి న ఒక ప్రకటనలో డబ్బులు ఇవ్వకుండా బట్టలు ఉతకాలంటూ వేధింపులకు దిగడం

అమానుషమని కులహంకారంతో నర్సింహారెడ్డి వ్యవహరిస్తున్నారని ఆయన చర్యతో రజకుల కుటుంబాలు భయాందోళనలో ఉన్నాయని పేర్కొన్నారు. గడిచిన 15 రోజులకు వేధింపులకు గురి చేస్తున్న నర్సింహారెడ్డిపై పోలీసులు ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం దారుణమని తక్షణమే చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా రజకులకు బేషరుతుగా క్షమాపణ చెప్పాలన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement