Friday, April 26, 2024

Breaking: ఉప‌రాష్ట్ర‌ప‌తి వేదిక ప‌రిశీలిస్తుండ‌గా ప్ర‌మాదం.. ఇంటెలిజెన్స్ డీఎస్పీ మృతి (వీడియో)

మాదాపూర్ శిల్పకళా వేదికలో ఎల్లుండి జరగబోయే సిరివెన్నెల సీతారమశాస్ట్రీ బుక్ ఆవిష్కరణ కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొననున్నారు.. ఈ కార్యక్రమం ఏర్పాట్ల‌పై నివేదిక ఇవ్వడం కోసం స్టేజీపై నించొని ఫొటోలు తీస్తూ స్టేజీ సమీపంలో ఉన్న గుంతలో పడిపోయాడు ఇంటెలిజెన్స్ డీఎస్పీ కుమార్ అమ్మిరేశ్‌. దీంతో తీవ్ర గాయాలైన డీఎస్పీని స్థానికంగా ఉన్న మెడికవర్ హాస్పిటల్ కి తరలించగా తలకు తీవ్ర గాయమై చికిత్స పొందుతూ ఇవ్వాల సాయంత్రం తుది శ్వాస విడిచారు.

ఇంటెలిజెన్స్ బ్యూరోలో అసిస్టెంట్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న కుమార్ అమ్మిరేశ్ స్వస్థలం బిహార్ రాష్ట్రంలోని పాట్నా. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలతో జూబ్లీహిల్స్ ఐబీ క్వార్టర్స్ లో నివాసం ఉంటున్నారు. కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ వీడియోని www.prabhanews.com క్లిక్​ చేసి వీడియో సెక్షన్​లో చూడొచ్చు

Advertisement

తాజా వార్తలు

Advertisement