Saturday, May 4, 2024

Accident – కారు – డిసిఎం వాహ‌నం ఢీ … ఇద్ద‌రు సూర్యాపేట వాసులు మృతి

విజ‌య‌వాడ – ఏపీలోని విజయవాడ గన్నవరం వద్ద ఆగిఉన్న కారును డీసీఎం వాహనం ఢీ కొనడంతో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి.మృతులు సూర్యాపేట జిల్లా చింతపాలెం గ్రామానికి చెందిన నాగుల్‌, మతిన్‌గా గుర్తించారు. మృతదేహాలను గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ ఇద్దరిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి గల కారణమని పోలీసులు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement