Tuesday, May 21, 2024

ACB Court – పోటాపోటీగా వాద‌న‌లు…. తుదితీర్పు పై ఉత్కంఠ‌..

విజ‌య‌వాడ – స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో అరెస్టయిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని సీఐడీ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. గతరాత్రి సుదీర్ఘంగా ఆయన్ను విచారించిన అధికారులు.. రిమాండ్‌ రిపోర్టును కోర్టుకు సమర్పించారు. 2021లో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేదు. కాగా, కొద్దిసేపటి క్రితమే ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరను చేర్చి రిమాండ్ రిపోర్టును సమర్పించారు. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితులతో కలిసి చంద్రబాబే కుట్రకు సుత్రధారిగా వ్యవహరించారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.టీడీపీ నేత ఇల్లందుల రమేష్ ద్వారా సీమెన్స్‌ కంపెనీ ప్రతినిధులు చంద్రబాబును కలిసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం కోర్టులో వాదనలు ప్రారంభం కాగా.. సీఐడీ తరఫున ఏఏజీ సుధాకర్‌రెడ్డి, చంద్రబాబు తరపున లాయర్‌ సిద్దార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు. ఇరుపక్షాల మధ్య వాడీవేడీగా వాదనలు కొసాగుతున్నాయి.ఓపెన్ కోర్టులోనే వాదనలు జరగుతున్నాయి.

మొదట తన ఛాంబర్‌లో వాదనలు వినిపించాలని న్యాయమూర్తి కోరగా.. ఓపెన్ కోర్ట్ లోనే వాదనలు వినాలని న్యామూర్తికి టీడీపీ లీగల్ టీం విజ్ఙప్తి చేసింది. దీంతో కోర్టు హాల్‌లోనే వాదనలు మెుదలయ్యాయి. గంట నుంచి గంటన్నర వరకు వాదనలు కొనసాగే అవకాశం ఉంది. అయితే చంద్రబాబుకు బెయిల్ లభిస్తుందా? లేక రిమాండ్‌కు తరలిస్తారా? అనేది ఉత్కంఠగా మారింది.టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ స్కిల్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి చంద్రబాబు అని ఏపీ సీఐడీ ఆయన్ను అరెస్టు చేసింది. జర్మనీకి చెందిన సీమెన్స్‌ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ ముసుగులో రూ.3,300 కోట్ల ప్రాజెక్ట్‌కు ఒప్పందం కుదుర్చుకుని, ఎలాంటి ప్రాజెక్ట్‌ చేపట్టకుండానే నిబంధనలకు విరుద్ధంగా రూ.371 కోట్లు విడుదల చేయించి.. అందులో రూ.241 కోట్లు కొల్లగొట్టారని అభియోగాలు మోపారు. ఈ మేరకు శనివారం నంద్యాలలో ఆయన్ను అరెస్టు చేసి భారీ భద్రత మధ్య విజయవాడకు తరలించారు.చంద్రబాబును ఆదివారం తెల్లవారుజాము వరకు సిట్‌ కార్యాలయంలోనే ఉంచిన సీఐడీ అధికారులు.. 4 గంటల సమయంలో విజయవాడ జీజీహెచ్‌కు తరలించారు. బీపీ, మధుమేహం, ఎక్స్‌రే, ఛాతీ సంబంధిత పరీక్షలు నిర్వహించారు.

శనివారం సాయంత్రం 5 గంటలకు సిట్‌ కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు.. ఆదివారం తెల్లవారుజామున 3.00 గంటల వరకూ సుమారు 10 గంటలపాటు సిట్‌ కార్యాలయంలోనే ఉన్నారు. జీజీహెచ్ నుంచి మళ్లీ సిట్ కార్యాలయానికి తరలించిన అధికారులు ఆ తర్వాత ఆయన్ను ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం వాదనలు జరుగుతుండగా.. న్యాయమూర్తి ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది….

కొన్ని ముఖ్యాంశాలు..

- Advertisement -

చంద్ర బాబు నాయుడు గారి తరపున వాదనలు పినిపించడానికి ముగ్గురిని కోరగా… ఇద్దరికి మాత్రమే అవకాశం ఇచ్చిన జస్టిస్ హిమ బిందు..

సిద్ధార్థ లోద్రా, పోసాని వెంకటేశ్వర రావు పేర్లు చెప్పగా అనుమతి ఇచ్చిన జస్టిస్..

ఇంతమంది లాయర్ లు ఇక్కడ ఎందుకు వున్నారు.. స్వచ్ఛందంగా మీరే వెళ్ళండి … 15 మంది కి మాత్రమే అవకాశం.. జస్టిస్

409 సెక్షన్ కింద arguments జరుగుతున్నాయి..

అసలు ఈ సెక్షన్ ఈ కేసు లో పెట్టడం సబబు కాదని లోద్ర వాదనలు.. 409 పెట్టాలి అంటే ముందు proper సాక్ష్యం చూపాలి..

రిమాండ్ రిపోర్ట్ తిరస్కరించాలని నోటీసు ఇచ్చిన లొద్రా తిరస్కరణ పై వాదనలు కు అవకాశం కల్పించిన జస్టిస్

రిమాండ్ రిపోర్ట్ తిరస్కరణ చేయాలి అని ముందు వాదనలు వినిపిస్తున్న లోడ్రా

శనివారం ఉదయం 5.40కి అరెస్ట్ చేసిన తనను నిబందనలకు వ్యతిరేకంగా 24 గంటల తర్వాత కోర్టులో హాజరుపరిచారంటూ చంద్రబాబు న్యాయవాదులు అభ్యంతరం… దీనిపైనా కొనసాగుతున్న వాదనలు

Advertisement

తాజా వార్తలు

Advertisement